దాడికి కుట్ర.!!
- June 04, 2016
ఈ ఏడాది జరగనున్న అమర్నాథ్ యాత్రపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ కెకె. శర్మ వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తులపై దాడులు జరపడానికి మిలిటెంట్లు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు హాజరయ్యే భక్తుల భద్రతకై తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. నిన్న బీఎస్ఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేస్తారని వూహించలేదన్నారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మృతి చెందిన జవాన్లకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







