గుండె సమస్యలున్న వాళ్లు వేరు శనగలు తినకూడదా.?
- March 20, 2024
డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పల్లీలు (వేరు శెనగలు) తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలలో చాలా మంచి పోషకాలున్నాయ్. వాటిని వంటల్లో వాడుకోవడం మంచిదే. అలాగే, డ్రై రోస్ట్ చేసుకుని, లేదంటే ఉడికించుకుని స్నాక్స్లా తినడం కూడా మంచిదే.
ఉడికించిన పల్లీలు తింటే ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అయితే, ఆయిల్, మసాలా మిక్స్ చేసిన పల్లీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
పల్లీల్లో నియాసిన్, విటమిన్ ఇ, థయామిన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా వుంటాయ్.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. పల్లీలను కూడా మితంగానే తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో వుంటుంది. అతి అయితే, అధికమవుతుంది.
ఉడికించిన వేరు శెనగలు తింటే డయాబెటిస్ వున్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో వుంటాయ్.
గుండె సమస్యలున్నవాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు ఉడికించిన పల్లీలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రక్తపోటుని బ్యాలెన్స్డ్గా వుంచడంలో తోడ్పడతాయ్. అందు వల్ల గుండె ఆరోగ్యానికి ఎటువంటి హానీ వుండదు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









