గుండె సమస్యలున్న వాళ్లు వేరు శనగలు తినకూడదా.?
- March 20, 2024డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పల్లీలు (వేరు శెనగలు) తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలలో చాలా మంచి పోషకాలున్నాయ్. వాటిని వంటల్లో వాడుకోవడం మంచిదే. అలాగే, డ్రై రోస్ట్ చేసుకుని, లేదంటే ఉడికించుకుని స్నాక్స్లా తినడం కూడా మంచిదే.
ఉడికించిన పల్లీలు తింటే ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అయితే, ఆయిల్, మసాలా మిక్స్ చేసిన పల్లీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
పల్లీల్లో నియాసిన్, విటమిన్ ఇ, థయామిన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా వుంటాయ్.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. పల్లీలను కూడా మితంగానే తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో వుంటుంది. అతి అయితే, అధికమవుతుంది.
ఉడికించిన వేరు శెనగలు తింటే డయాబెటిస్ వున్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో వుంటాయ్.
గుండె సమస్యలున్నవాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు ఉడికించిన పల్లీలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రక్తపోటుని బ్యాలెన్స్డ్గా వుంచడంలో తోడ్పడతాయ్. అందు వల్ల గుండె ఆరోగ్యానికి ఎటువంటి హానీ వుండదు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!