గుండె సమస్యలున్న వాళ్లు వేరు శనగలు తినకూడదా.?
- March 20, 2024
డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పల్లీలు (వేరు శెనగలు) తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలలో చాలా మంచి పోషకాలున్నాయ్. వాటిని వంటల్లో వాడుకోవడం మంచిదే. అలాగే, డ్రై రోస్ట్ చేసుకుని, లేదంటే ఉడికించుకుని స్నాక్స్లా తినడం కూడా మంచిదే.
ఉడికించిన పల్లీలు తింటే ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అయితే, ఆయిల్, మసాలా మిక్స్ చేసిన పల్లీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.
పల్లీల్లో నియాసిన్, విటమిన్ ఇ, థయామిన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా వుంటాయ్.
అయితే, అతి సర్వత్రా వర్జ్యయేత్ కదా. పల్లీలను కూడా మితంగానే తీసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుండడం వల్ల తక్కువగా తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో వుంటుంది. అతి అయితే, అధికమవుతుంది.
ఉడికించిన వేరు శెనగలు తింటే డయాబెటిస్ వున్నవారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో వుంటాయ్.
గుండె సమస్యలున్నవాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు ఉడికించిన పల్లీలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రక్తపోటుని బ్యాలెన్స్డ్గా వుంచడంలో తోడ్పడతాయ్. అందు వల్ల గుండె ఆరోగ్యానికి ఎటువంటి హానీ వుండదు.
తాజా వార్తలు
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !
- స్విస్ ఓపెన్: శ్రీకాంత్ శుభారంభం..