భారతీయ స్టాక్లలో కువైట్ పెట్టుబడులు తగ్గుముఖం
- March 24, 2024
కువైట్: కువైట్ యొక్క సావరిన్ వెల్త్ ఫండ్ను నిర్వహిస్తున్న కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (KIA) డిసెంబర్ 2023 నాటికి భారతీయ మార్కెట్కి దాని ఎక్స్పోజర్ను 30 శాతం తగ్గించిందని భారతదేశంలోని ప్రముఖ వ్యాపార దినపత్రిక 'బిజినెస్ స్టాండర్డ్' నివేదించింది. భారతదేశంలో మూడవ అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ.. డజనుకు పైగా దేశీయ స్టాక్లలో భారతీయ మార్కెట్లో సుమారు రూ.9,019 కోట్లు పెట్టుబడి పెట్టింది. KIA మొదటి ఐదు హోల్డింగ్లలో మారుతీ సుజుకి, ఎం&ఎం, జొమాటో, ఒబెరాయ్ రియాల్టీ, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, భారతదేశపు అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్.. సింగపూర్కు చెందిన ప్రభుత్వ పెట్టుబడి కార్పొరేషన్ (జిఐసి), దేశీయ ఈక్విటీ హోల్డింగ్లు డిసెంబరు 2023తో ముగిసిన 12 నెలల కాలంలో భారతీయ మార్కెట్లో 32 శాతం పెరిగి రూ. 2.14 ట్రిలియన్లకు చేరుకున్నాయి. భారతదేశపు రెండవ అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ అయిన నార్వే యొక్క నార్జెస్ కూడా దాని ఇండియా ఈక్విటీ హోల్డింగ్స్ 21 శాతం పెరిగి రూ. 86,628 కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR







