భారత కార్మికుల క్యాంప్ ని సందర్శించిన మొదీ
- June 05, 2016
ఆయన ఒక దేశానికి ప్రధాని.. కానీ ఓ సాధారణ వ్యక్తిలాగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆయన మరెవరో కాదు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రస్తుతం మోదీ ఖతార్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఆయన దోహలోని భారత కార్మికుల క్యాంప్ను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. వారితో కలిసి కూర్చొని అక్కడే భోజనం చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్మికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 'మా కుటుంబ సభ్యుల్లోని వ్యక్తి మాతో భోజనం చేసినట్లుందని చెమర్చిన కళ్లతో ఓ కార్మికుడు తన ఆనందాన్ని పంచుకున్నాడు.మోదీ ఉత్తమ ప్రధాని. ఆయన మాతో కలిసి కూర్చున్నారు. మా సమస్యలను అడిగి తెలుసుకున్నార'ని మరో కార్మికుడు తెలియజేశాడు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై దేశాధినేతలు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







