భారత కార్మికుల క్యాంప్ ని సందర్శించిన మొదీ
- June 05, 2016
ఆయన ఒక దేశానికి ప్రధాని.. కానీ ఓ సాధారణ వ్యక్తిలాగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆయన మరెవరో కాదు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రస్తుతం మోదీ ఖతార్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఆయన దోహలోని భారత కార్మికుల క్యాంప్ను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. వారితో కలిసి కూర్చొని అక్కడే భోజనం చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్మికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 'మా కుటుంబ సభ్యుల్లోని వ్యక్తి మాతో భోజనం చేసినట్లుందని చెమర్చిన కళ్లతో ఓ కార్మికుడు తన ఆనందాన్ని పంచుకున్నాడు.మోదీ ఉత్తమ ప్రధాని. ఆయన మాతో కలిసి కూర్చున్నారు. మా సమస్యలను అడిగి తెలుసుకున్నార'ని మరో కార్మికుడు తెలియజేశాడు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై దేశాధినేతలు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









