భారత కార్మికుల క్యాంప్ ని సందర్శించిన మొదీ
- June 05, 2016
ఆయన ఒక దేశానికి ప్రధాని.. కానీ ఓ సాధారణ వ్యక్తిలాగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆయన మరెవరో కాదు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ప్రస్తుతం మోదీ ఖతార్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ఆయన దోహలోని భారత కార్మికుల క్యాంప్ను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి మాట్లాడారు. భారత కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల ఇబ్బందులను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. వారితో కలిసి కూర్చొని అక్కడే భోజనం చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్మికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 'మా కుటుంబ సభ్యుల్లోని వ్యక్తి మాతో భోజనం చేసినట్లుందని చెమర్చిన కళ్లతో ఓ కార్మికుడు తన ఆనందాన్ని పంచుకున్నాడు.మోదీ ఉత్తమ ప్రధాని. ఆయన మాతో కలిసి కూర్చున్నారు. మా సమస్యలను అడిగి తెలుసుకున్నార'ని మరో కార్మికుడు తెలియజేశాడు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై దేశాధినేతలు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







