హైదరాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసు ప్రారంభం
- April 02, 2024
హైదరాబాద్: స్పైస్జెట్ తో హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు SG611 విమానం 10:45 గంటలకు బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం అయోధ్య నుంచి 13:25 గంటలకు బయలుదేరి 15:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ - స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "అయోధ్య నగరం మరియు సమీపంలోని సాంస్కృతిక మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికలకు ఈ కొత్త సేవను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది. విమానయాన సంస్థలతో కలిసి ప్రయాణికలకు మెరుగైన సేవలు అందిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం తమ మార్గాలను విస్తరించేందుకు నిరంతరంగా కృషి చేస్తోందన్నారు.”
పవిత్ర నగరంగా గుర్తింపు పొంది, శ్రీరాముడి జన్మస్థలంగా పూజలందుకుంటున్న అయోధ్యకు మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









