హైదరాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసు ప్రారంభం
- April 02, 2024
హైదరాబాద్: స్పైస్జెట్ తో హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు SG611 విమానం 10:45 గంటలకు బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం అయోధ్య నుంచి 13:25 గంటలకు బయలుదేరి 15:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ - స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "అయోధ్య నగరం మరియు సమీపంలోని సాంస్కృతిక మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికలకు ఈ కొత్త సేవను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది. విమానయాన సంస్థలతో కలిసి ప్రయాణికలకు మెరుగైన సేవలు అందిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం తమ మార్గాలను విస్తరించేందుకు నిరంతరంగా కృషి చేస్తోందన్నారు.”
పవిత్ర నగరంగా గుర్తింపు పొంది, శ్రీరాముడి జన్మస్థలంగా పూజలందుకుంటున్న అయోధ్యకు మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత ఉంది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'