భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం..మైక్రోసాఫ్ట్ ఆందోళన
- April 06, 2024
న్యూఢిల్లీ: భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపింది. ఏఐ ఆధారిత కాంటెంట్తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. ఎన్నికల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్ను సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేయనున్నారని, కీలకమైన ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్రచారం జరుగుతుందని మైక్రోసాఫ్ట్ తన రిపోర్టులో చెప్పింది. మీమ్స్, వీడియోలు, ఆడియో రూపంలో ఆ కామెంట్ ఉంటుందని, చైనా పొజిషన్ను సపోర్టు చేసే రీతిలో వాటిని రూపొందించనున్నారు. అయితే ఇలాంటి ఎత్తుగడలతో జనరల్ ఎలక్షన్స్లో ప్రభావం చూపడం తక్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









