ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్..
- April 07, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే ఉన్న మార్గాల్లో మెట్రోరైలు ఒకటి. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు షాకిచ్చారు.
ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేశారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్(రూ.59)ను పూర్తిగా రద్దు చేశారు. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉండేది.
అలాగే.. మెట్రోకార్డుపై ఇస్తున్న 10శాతం రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. కాగా.. గతేడాది ఏప్రిల్లో రద్దీ వేళల్లో మెట్రోకార్డు పై ఇస్తున్న రాయితీని ఎత్తివేయగా.. ఇప్పుడు పూర్తిగా తొలగించారు. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కోచ్ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!