ఛార్జీలు పెంచకుండానే హైదరాబాద్ మెట్రో షాక్..
- April 07, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే ఉన్న మార్గాల్లో మెట్రోరైలు ఒకటి. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు షాకిచ్చారు.
ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులపై కొంత భారం వేశారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్(రూ.59)ను పూర్తిగా రద్దు చేశారు. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని తెలిపారు. ఈ కార్డుతో రూ.59 చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఈ సౌలభ్యం అందుబాటులో ఉండేది.
అలాగే.. మెట్రోకార్డుపై ఇస్తున్న 10శాతం రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. కాగా.. గతేడాది ఏప్రిల్లో రద్దీ వేళల్లో మెట్రోకార్డు పై ఇస్తున్న రాయితీని ఎత్తివేయగా.. ఇప్పుడు పూర్తిగా తొలగించారు. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కోచ్ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







