ఈద్ సెలవుల్లో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?
- April 07, 2024
యూఏఈ:ఈ ఈద్ సెలవుదినం ఒమన్ లేదా నార్తర్న్ ఎమిరేట్స్కు రోడ్ ట్రిప్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే,బాగా పొడవైన క్యూలు మరియు భారీ ట్రాఫిక్ జామ్ లకు సిద్ధంకండి. గత ఈద్ మరియు సుదీర్ఘ వారాంతాల్లో ప్రయాణించిన నివాసితులు తమ అనుభవాలను పంచుకున్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఇతరులను హెచ్చరించారు. చాలా మంది గంటల తరబడి రోడ్లపైనే ఇరుక్కుపోయినట్లు షార్జా నివాసి ఎయిమాద్ హసన్ తెలిపారు. గత ఈద్లో స్నేహితులతో కలిసి ఖోర్ఫక్కన్కు వెళ్లినప్పుడు తన అనుభవాన్ని వివరించాడు. “షార్జా నుండి ఖోర్ఫక్కన్కి సాధారణ డ్రైవ్కు కేవలం ఒకటిన్నర గంటలలోపే పడుతుంది. అయితే, గత ఈద్, భయంకరమైన ట్రాఫిక్ కారణంగా మాకు మూడున్నర గంటలకు పైగా పట్టింది. దుబాయ్ మరియు షార్జా నివాసులందరూ తూర్పు పట్టణానికి ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. ”అని హసన్ అన్నారు.
గత సంవత్సరం ఈద్ సందర్భంగా రస్ అల్ ఖైమాలోని జాబెల్ జైస్ను సందర్శించినప్పుడు మరో నివాసి మహమ్మద్ ఊటోమ్ తన కష్టాలను పంచుకున్నాడు. "RAKలోని మహ్మద్ బిన్ జాయెద్ రోడ్లోని రహదారి రద్దీగా ఉంది. మా సాయంత్రాన్ని సవాలుగా మార్చింది" అని ఊటోమ్ చెప్పారు. జబెల్ జైస్ రోడ్డులో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉందని, దీంతో చాలా మంది వెనుదిరుగుతున్నారని తెలిపారు. "ఈ శిఖరాన్ని చేరుకోవడానికి మాకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. సాధారణంగా ట్రాఫిక్ లేకుండా కేవలం 20 నిమిషాలు మాత్రమే పట్టే ప్రయాణం." అన్నారాయన.
గత లాంగ్ వీకెండ్లో హట్టాకి వెళ్లిన లాబనీస్ ప్రవాసుడు మరియు దుబాయ్ నివాసి అబ్దుల్లా యాసీన్ “రోడ్డుపై అధిక ట్రాఫిక్ కారణంగా ప్రశాంతమైన హట్టా పట్టణంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకున్న చాలా మంది ప్రజలు ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇది సెలవు దినాలలో ప్రసిద్ధ మార్గాల్లో రద్దీని చూపుతుంది.”అని యాసీన్ అన్నారు. గత సంవత్సరం ఒమన్కు వెళ్లిన నివాసితులు అధిక ట్రాఫిక్ కారణంగా సరిహద్దు వద్ద దాదాపు రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని చెప్పారు. "మేము ఉదయం 11 గంటలకు సరిహద్దుకు చేరుకున్నాము. మధ్యాహ్నం 2 గంటలకు ఒమన్ భూభాగంలోకి ప్రవేశించాము." అని ముక్సిత్, బిజినెస్ బేలోని ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్ చెప్పారు. "మేము భారీ రద్దీని ఎప్పుడూ ఊహించలేదు. మేము సాయంత్రం 6 గంటలకు మస్కట్ చేరుకున్నాము. ఇది మా రోజును వృధా చేసింది మరియు మమ్మల్ని అలసిపోయేలా చేసింది" అని ముక్సిత్ చెప్పారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







