BAPS హిందూ మందిర్.. ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రారంభం
- April 10, 2024
అబుదాబి: BAPS హిందూ మందిర్ సందర్శకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా యూజర్ ఫ్రెండ్లీ ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. హిందూ మందిర్ ప్రారంభమైనప్పటి నుండి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే ఈద్, రామనవమి మొదలైన పండుగ సెలవుల సమయంలో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సందర్శకుల కోసం కొత్త ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియ అమలు చేయనున్నట్లు మందిర్ ప్రతినిధి తెలిపారు. బుకింగ్ ప్రక్రియ ద్వారా సందర్శకులు వారి ప్రాధాన్యత తేదీ, సమయ స్లాట్ను ఎంచుకోవచ్చని, వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని , ఈ విధానం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం, ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ కోసం https://www.mandir.ae/visitని సందర్శించాలని సూచించింది. సోమవారాల్లో BAPS హిందూ మందిర్ ప్రజలకు మూసివేయబడిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









