BAPS హిందూ మందిర్.. ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రారంభం
- April 10, 2024
అబుదాబి: BAPS హిందూ మందిర్ సందర్శకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా యూజర్ ఫ్రెండ్లీ ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. హిందూ మందిర్ ప్రారంభమైనప్పటి నుండి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే ఈద్, రామనవమి మొదలైన పండుగ సెలవుల సమయంలో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సందర్శకుల కోసం కొత్త ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియ అమలు చేయనున్నట్లు మందిర్ ప్రతినిధి తెలిపారు. బుకింగ్ ప్రక్రియ ద్వారా సందర్శకులు వారి ప్రాధాన్యత తేదీ, సమయ స్లాట్ను ఎంచుకోవచ్చని, వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని , ఈ విధానం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం, ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ కోసం https://www.mandir.ae/visitని సందర్శించాలని సూచించింది. సోమవారాల్లో BAPS హిందూ మందిర్ ప్రజలకు మూసివేయబడిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







