BAPS హిందూ మందిర్.. ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రారంభం
- April 10, 2024
అబుదాబి: BAPS హిందూ మందిర్ సందర్శకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా యూజర్ ఫ్రెండ్లీ ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. హిందూ మందిర్ ప్రారంభమైనప్పటి నుండి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాబోయే ఈద్, రామనవమి మొదలైన పండుగ సెలవుల సమయంలో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సందర్శకుల కోసం కొత్త ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ ప్రక్రియ అమలు చేయనున్నట్లు మందిర్ ప్రతినిధి తెలిపారు. బుకింగ్ ప్రక్రియ ద్వారా సందర్శకులు వారి ప్రాధాన్యత తేదీ, సమయ స్లాట్ను ఎంచుకోవచ్చని, వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని , ఈ విధానం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం, ప్రీ-రిజిస్ట్రేషన్ బుకింగ్ కోసం https://www.mandir.ae/visitని సందర్శించాలని సూచించింది. సోమవారాల్లో BAPS హిందూ మందిర్ ప్రజలకు మూసివేయబడిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







