ఏప్రిల్ 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

- April 10, 2024 , by Maagulf
ఏప్రిల్ 21న భువనగిరిలో కాంగ్రెస్ సభ

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆ రోజున నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదేరోజు జరిగే సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అటు మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంకా గాంధీని ఆహ్వానించాలని హస్తం నేతలు డిసైడ్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భువనగిరి ఎంపీ స్థానంపై రివ్యూ చేయనున్నారు. కాసేపట్లో ఆయన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు. దీనికి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితర నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com