రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి ప్రమాణం
- April 10, 2024
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు.
ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా రేణుకా చౌదరి సహా పలువురి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున ఏకైక అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









