ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
- April 12, 2024ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ ఆఫీసులో విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సర విద్యార్థుల్లో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ఆడపిల్లలదే పై చేయి.
ఇంటర్ ఫస్టియర్ లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో చిత్తూరు లీస్ట్ పర్సెంటేజ్ సాధించింది.
ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. అలాగే, 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ ఎగ్జాంలో మరొకసారి అవకాశం ఉంటుంది. మార్క్ లిస్ట్ లో సప్లమెంటరీలో పాస్ అయినట్లు ఉండదని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను http://resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఎన్నికల నేపథ్యంలో సర్కారు నిర్ణయం మేరకు ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4న ముగిసింది.
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీలో 26 జిల్లాల్లో 1,559 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.
బాలబాలికల వారీగా ఫలితాల వివరాలు
మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది
ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది
ఉత్తీర్ణత శాతం 64
మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది
ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది
ఉత్తీర్ణత శాతం 71
ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది
ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది
ఉత్తీర్ణత శాతం 75
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది
ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది
ఉత్తీర్ణత శాతం 81
ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో బాలికలదే పైచేయి
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల