మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- April 12, 2024న్యూ ఢిల్లీ: భారత దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్కు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. మూడో దశలో మొత్తం 94 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, దాద్రనగర్ హావేలి, డామన్ డయ్యు, గుజరాత్, గోవా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, లోక్ సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.
ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. ఇంతకు ముందే తొలి రెండు దశల ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేస్తుంది. 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పనిచేస్తారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వాడనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ