ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో క్రూరమైన చర్య
- June 06, 2016
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో క్రూరమైన చర్యకు పాల్పడింది. లైంగిక కోరిక తీర్చని 19 మంది బాలికలను దారుణంగా చంపేసింది. ఇరాక్లోని ఐఎస్ ఆధీనంలోని మోసోల్లో ఈ ఘటన జరిగింది. తమను సుఖపెట్టని బాలికలను ఉగ్రవాదులు ఇనుప జాలీలో బంధించారు.
అందరూ చూస్తుండగా నిప్పంటించి వారిని సజీవ దహనం చేశారు. భయంతో ఏ ఒక్కరు కూడా వారిని కాపాడలేకపోయినట్లు కుర్దీష్కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. వందలాది మంది చూస్తుండగానే ఆ దారుణానికి పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఇరాక్లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సెక్స్ బానిసలుగా మారడానికి అంగీకరించని యాజ్జీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు.
క్రైస్తవం, జోరాస్ట్రియన్, ఇస్లాం మతాలను ఆచరించే యాజ్జీ జాతి ప్రజలను ఐఎస్ఐఎ్ సైతాను ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలకు భయపడి దాదాపు యాభై వేల మంది యాజ్డీలు దేశం విడిచి పారిపోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







