శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

- April 17, 2024 , by Maagulf
శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నేడు శ్రీరామనవమి సందర్బంగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com