భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..
- April 17, 2024
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలా స్టేడియంలో సీతారాములవారి కల్యాణ మహోత్సవాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మిథిలా మండపంలో సీతారాములవారి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణంను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో భక్తులు ఇబ్బందిపడకుండా మిథిలా స్టేడియంలో ఏసీలు, 100 కూలర్లు, 270 ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా భద్రాచల సీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









