మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
- June 06, 2016
పండిన మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మామిడి పళ్ల గుజ్జుతో పూతలని ఎలా వేసుకోవచ్చో చూడండి..
ఒ క చెంచా బాగా పండిన మామిడిపండు గుజ్జుని తీసుకుని, అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్లా వేయాలి. అయితే పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తడి ఉండగానే మునివేళ్లతో రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.
రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్మీల్ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనం.
చెంచా గులాబీనీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా ముల్తానీమట్టికి.. రెండు చెంచాల మామిడిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం నిగారిస్తుంది.
రెండు చెంచాల పచ్చిపాలకి, చెంచా తేనెతోపాటూ పెద్దచెంచా మామిడిపండు గుజ్జుని కలిపి ప్యాక్లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









