మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
- June 06, 2016
పండిన మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మామిడి పళ్ల గుజ్జుతో పూతలని ఎలా వేసుకోవచ్చో చూడండి..
ఒ క చెంచా బాగా పండిన మామిడిపండు గుజ్జుని తీసుకుని, అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్లా వేయాలి. అయితే పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తడి ఉండగానే మునివేళ్లతో రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.
రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్మీల్ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనం.
చెంచా గులాబీనీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా ముల్తానీమట్టికి.. రెండు చెంచాల మామిడిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం నిగారిస్తుంది.
రెండు చెంచాల పచ్చిపాలకి, చెంచా తేనెతోపాటూ పెద్దచెంచా మామిడిపండు గుజ్జుని కలిపి ప్యాక్లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







