మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
- June 06, 2016
పండిన మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నారా? అయితే మామిడితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మామిడి పళ్ల గుజ్జుతో పూతలని ఎలా వేసుకోవచ్చో చూడండి..
ఒ క చెంచా బాగా పండిన మామిడిపండు గుజ్జుని తీసుకుని, అందులో చెంచా ముల్తానీమట్టిని వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్లా వేయాలి. అయితే పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కాస్త తడి ఉండగానే మునివేళ్లతో రుద్ది కడిగేసుకుంటే సరిపోతుంది.
రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్మీల్ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనం.
చెంచా గులాబీనీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా ముల్తానీమట్టికి.. రెండు చెంచాల మామిడిపండు గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం నిగారిస్తుంది.
రెండు చెంచాల పచ్చిపాలకి, చెంచా తేనెతోపాటూ పెద్దచెంచా మామిడిపండు గుజ్జుని కలిపి ప్యాక్లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









