దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- April 18, 2024యూఏఈ: దుబాయ్లోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ దీపక్ మోహన్.. వరదల మధ్య చిక్కుకుపోయిన పర్యాటకులు మరియు నివాసితులను రక్షించడానికి తన ఆఫ్-రోడింగ్ నైపుణ్యాలను ఉపయోగించారు. తన 2000 మోడల్ ల్యాండ్క్రూయిజర్ను వరద నీటిలో నడుపుతూ, అతను చాలా మంది వ్యక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇందులో ఒక నిండు గర్భిణి నర్సు, ఆమె కుమార్తెతో పాటు వీల్చైర్లో ఉన్న మహిళ మోహన్ నిస్వార్థ పనులకు చాలా మంది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ రాత్రి 8:30 గంటల సమయంలో అల్ జద్దాఫ్లోని ఇంట్లో ఉన్నప్పుడు తన ఆఫ్-రోడింగ్ గ్రూప్లో సమాచారం అందించానని తెలిపారు. అలాగే దుబాయ్ మాల్లో చిక్కుకున్న కజకిస్తాన్ కుటుంబం గురించి వాట్సాప్ సందేశం వచ్చినప్పుడు రాత్రి 9:45 గంటల సమయంలో బిజినెస్ బేలోని ఎగ్జిక్యూటివ్ టవర్స్ నుండి తిరిగి వస్తున్నట్లు మోహన్ తెలిపారు. ఒక చిన్న కుమార్తెతో ఉన్న జంటను మంఖూల్లోని వారి హోటల్కు తీసుకువెళ్లినట్టు మోహన్ తెలిపారు. ఆ తర్వాత ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ వద్ద ఒక భారతీయ జంట అల్ సఫా స్ట్రీట్కు వెళ్లేందుకు క్యాబ్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న జంటను మీనా బజార్లోని ఆస్టోరియా హోటల్కి చేర్చినట్లు తెలిపారు. అల్ బార్షాలోని ఒక క్లినిక్లో నిండు గర్భిణి నర్సు మరియు మరో ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇరుక్కున్నట్లు వాట్సాప్లో సందేశం రాగానే తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అల్ ఖైల్లో వారిని సురక్షితంగా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వీల్చైర్లో ఉన్న మహిళ మరియు ఆమె కుమార్తె తనకు సహాయం చేసిన చివరి వ్యక్తులు అని మోహన్ చెప్పారు. "వారు ముందుగా దుబాయ్ ఎయిర్పోర్ట్స్, టెర్మినల్ 3కి చేరుకున్నారు. రవాణా అందుబాటులో లేనందున బయలుదేరలేకపోయారు." కుమార్తె తులికా ప్రదీప్, మోహన్కు కృతజ్ఞతలు తెలుపుతూ వాట్సాప్ సపోర్ట్ గ్రూప్లో పోస్ట్ చేసింది. "ధన్యవాదాలు, మీరు ఒక దేవదూత. నేను నా సీనియర్ సిటిజన్ అమ్మతో విమానాశ్రయంలో చిక్కుకున్న క్లిష్ట పరిస్థితిలో మీరు మాకు సహాయం చేసారు. చాలా ధన్యవాదాలు మరియు దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు! మీరు అద్భుతమైన డ్రైవర్. అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?