ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- April 18, 2024
భువనేశ్వర్: జాజ్పూర్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్గా 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నిఖిల్ పవన్ కళ్యాణ్ను ఒడిశా ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ & పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిఖిల్ పవన్ కళ్యాణ్ ఒడిశాలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా బదిలీకి ముందు కటక్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్గా పనిచేశారు. ప్రస్తుత జాజ్పూర్ కలెక్టర్ శుభాంకర్ మహపాత్ర తన బావ ఢెంకనల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ముందు స్వచ్ఛందంగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఆయనను మార్చాలని ఈసీ నిర్ణయించింది. కాగా నిఖిల్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నానికి చెందిన వారు కాగా, ఆయన తండ్రి మృత్యుంజయ రావు గుడ్లవల్లేటి హిందూ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







