నేషనల్ సివిల్ సర్వీస్ డే
- April 21, 2024
భారతదేశంలో పరిపాలనా యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న అధికారుల సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీస్ డేను నిర్వహిస్తారు. సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు. ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత.
ఏప్రిల్ 21, 2006న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మొదటిసారిగా నేషనల్ సివిల్ సర్వీస్ డే(national civil services day) జరుపుకున్నారు. 1947లో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజు ప్రసంగించడం విశేషం. ఆ క్రమంలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు.
భారతదేశంలో సివిల్ సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B అనే విభాగాలుగా ఉంటాయి.అయితే నేషనల్ సివిల్ సర్వీస్ డేను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడం సహా వారి విజయాలను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుతున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రధాని అవార్డులను ప్రదానం చేస్తారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







