'పద్మవిభూషణ్' అవార్డు స్వీకరించిన వెంకయ్య నాయుడు
- April 22, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ సాయంత్రం పద్మ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. తెలుగుజాతి గర్వించేలా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం "పద్మవిభూషణ్"ను వినమ్రంగా, సంతోషంగా స్వీకరించాను. రైతులు, మహిళలు, యువత సహా నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరికీ సగర్వంగా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్,నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామానికి చెందిన రైతుబిడ్డనైన నేను ఇంత గొప్ప గౌరవానికి అర్హుడను అవుతానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. గ్రామీణ నేపథ్యం నుంచి మొదలైన నా ప్రజా ప్రస్థానం అనేక సుదీర్ఘ పోరాటాలు, సవాళ్ళు, సమస్యల మధ్య సాగింది. ఈ గమనంలో ఎదురైన అనేక ప్రతికూలతలను, ఇబ్బందులను అధిగమించి భారతదేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతిగా దేశ ప్రజలకు సేవలు అందించటం భగవంతుని దయగా... నా జీవితపర్యంతం కట్టుబడిన నిబద్ధత, సిద్ధాంతాలకు లభించిన ప్రతిఫలంగా భావిస్తాను.
సమాజం పట్ల నిబద్ధత, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడి ఉండేందుకు నేను చేసిన వినమ్రపూర్వకమైన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ప్రతి అడుగులోనూ శక్తిని, ధైర్యాన్ని అందించిన భగవంతునికి ప్రణతులు అర్పిస్తూ, ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
చివరి శ్వాస వరకూ దేశ మాత సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న నా సంకల్పానికి ఈ పురస్కారం మరింత శక్తిని, విశ్వాసాన్ని అందించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







