తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- April 24, 2024తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ. ఒంటి గంటకు విడుదల చేయనుంది. ప్రతినెలా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ ఇటీవలే ప్రకటించింది. జులై నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం.. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.inవెబ్సైట్కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు