ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- April 24, 2024
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు అయ్యాయి.ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోదీ రాష్ట్రానికి రానున్నారు.
పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోదీ అక్కడ బీజేపీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు.అనంతరం వచ్చే నెల 3, 4 తేదీల్లోనూ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో నారాయణపేట్, చేవెళ్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు మోదీ హాజరవుతారు.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలదళం భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు.ఇందులో భాగంగానే మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









