ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- April 25, 2024
మస్కట్: డిజిటల్ ద్వారా భూ లావాదేవీలను సులభతరం చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' సేవను ప్రారంభించింది. హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ తన ప్రతిష్టాత్మకమైన 'సంపన్న సమాజాల కోసం స్థిరమైన పట్టణ అభివృద్ధి' కి అనుగుణంగా తన సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ భూమి మంజూరు వ్యవస్థతో సహా అన్ని సేవలను డిజిటటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ భూములను మంజూరు చేయడానికి సంబంధించి రాయల్ డిక్రీ నం. (42/2021) జారీ చేసినప్పటి నుండి, ప్రభుత్వ నివాస ప్లాట్ల కోసం అర్హులైన పౌరులకు వివిధ గృహాలను అందించడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని, ఈ ఎంపిక ప్రక్రియలో కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 2023లో 25,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు దీని నుండి లబ్ది పొందారని, దీని తర్వాత "ఓన్ యువర్ ల్యాండ్" వంటి అనేక హౌసింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని, ఇది ఇంటరాక్టివ్ ద్వారా సమగ్ర సేవలతో విశిష్టమైన ప్లాన్లు మరియు లొకేషన్లలో ప్రభుత్వ-సబ్సిడీ ధరకు భూమిని పొందేందుకు లబ్ధిదారుని అనుమతిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!
- అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన..ప్రత్యేకంగా సౌదీ పెవిలియన్..!!
- Q1లో స్థిరంగా ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్..!!
- దుబాయ్లో జూన్ 1నుంచి సాలిక్ వ్యాట్ నిబంధన..!!
- తిరుమలకు రూ.1.13 కోట్ల ఎలక్ట్రిక్ బస్సు విరాళం
- విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్
- భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!
- కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తిదాయక విజయం









