ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు

- April 26, 2024 , by Maagulf
ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు

రియాద్: ఈ ఏడాది ఈద్ అల్-ఫితర్ వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల 38 ఎమర్జెన్సీ కేసులను ఆసుపత్రి అత్యవసర విభాగాలు అందుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దులాలి మాట్లాడుతూ.. బాణసంచా వాడకం ఈద్‌ను సంతోషకరమైన సందర్భం నుండి బాధాకరమైన క్షణంగా మారుస్తుందని అన్నారు. బాణసంచా కాల్చడం వల్ల పిల్లలకు గాయాలు కాకుండా చూడాలని, వారి ఆరోగ్యం, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com