నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి

- April 27, 2024 , by Maagulf
నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి

మస్కట్: గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నిజ్వా ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు నర్సులు మృతి చెందారు.  ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో మరణించారని అల్ దఖిలియా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హాస్పిటల్ తెలిపింది. మృతి చెందిన ముగ్గురు నర్సులలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు కాగా, మరోకరు ఈజిప్టుకు చెందినవారు. నర్సులు పని ముగించుకుని ఆసుపత్రి నుంచి తమ నివాసాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.  “ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో ముగ్గురు నర్సులు (అమని అబ్దుల్ లతీఫ్, షార్జా ఇలియాస్, మజితా రాజేష్) మరణించారు. మరో ఇద్దరు నర్సుల (షిర్లీ జాస్మిన్, మాలు మాథ్యూ) గాయపడ్డారు. వారు త్వరగా కోలుకోవాలని మేము దేవుడిని వేడుకుంటున్నాము. ’’ అని ఆస్పత్రి డైరెక్టరేట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com