నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- April 27, 2024
మస్కట్: గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నిజ్వా ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు నర్సులు మృతి చెందారు. ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో మరణించారని అల్ దఖిలియా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హాస్పిటల్ తెలిపింది. మృతి చెందిన ముగ్గురు నర్సులలో ఇద్దరు భారతదేశానికి చెందినవారు కాగా, మరోకరు ఈజిప్టుకు చెందినవారు. నర్సులు పని ముగించుకుని ఆసుపత్రి నుంచి తమ నివాసాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. “ఆసుపత్రి ముందు రన్ ఓవర్ ప్రమాదంలో ముగ్గురు నర్సులు (అమని అబ్దుల్ లతీఫ్, షార్జా ఇలియాస్, మజితా రాజేష్) మరణించారు. మరో ఇద్దరు నర్సుల (షిర్లీ జాస్మిన్, మాలు మాథ్యూ) గాయపడ్డారు. వారు త్వరగా కోలుకోవాలని మేము దేవుడిని వేడుకుంటున్నాము. ’’ అని ఆస్పత్రి డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!









