యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- May 04, 2024
యూఏఈ: యూఏఈ రోడ్లపై మరణాల సంఖ్య 2022తో పోలిస్తే గత సంవత్సరం 3% పెరిగాయి. రోడ్డు భద్రతా నిపుణులు ప్రమాదాల పెరుగుదలకు ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) 2023లో రోడ్డు భద్రత గణాంకాలపై ఇటీవల అప్లోడ్ చేసిన 'ఓపెన్ డేటా' ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు మరణాలు జరిగాయి. ఈ సంవత్సరం డేటా 2022లో నమోదైన 343 మరణాల కంటే 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కానీ 2021లో నమోదైన 381 మరణాల కంటే 8 శాతం తగ్గుదల నమోదు అయినట్లు అని రోడ్ సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ తెలిపారు. 2008 సంవత్సరంలో 1,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ మరణాలను నివేదిక తెలిపింది. MOI డేటా ప్రకారం.. 15 శాతం పెద్ద ప్రమాదాలు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల వల్ల జరుగుతున్నాయని ఎడెల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..







