యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- May 04, 2024
యూఏఈ: యూఏఈ రోడ్లపై మరణాల సంఖ్య 2022తో పోలిస్తే గత సంవత్సరం 3% పెరిగాయి. రోడ్డు భద్రతా నిపుణులు ప్రమాదాల పెరుగుదలకు ప్రధానంగా డ్రైవర్ల నిర్లక్ష్యం అని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) 2023లో రోడ్డు భద్రత గణాంకాలపై ఇటీవల అప్లోడ్ చేసిన 'ఓపెన్ డేటా' ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు మరణాలు జరిగాయి. ఈ సంవత్సరం డేటా 2022లో నమోదైన 343 మరణాల కంటే 3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కానీ 2021లో నమోదైన 381 మరణాల కంటే 8 శాతం తగ్గుదల నమోదు అయినట్లు అని రోడ్ సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ తెలిపారు. 2008 సంవత్సరంలో 1,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ మరణాలను నివేదిక తెలిపింది. MOI డేటా ప్రకారం.. 15 శాతం పెద్ద ప్రమాదాలు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల వల్ల జరుగుతున్నాయని ఎడెల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!









