తిరుమలలో భక్తుల రద్దీ..
- May 04, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా.. 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది. ఓ వైపు వేసవి సెలవులు కావడం.. మరోవైపు ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ లలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక గత ఏప్రిల్ నెలలో శ్రీవారిని 20.17 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.101.63 కోట్లు రాగా.. 94.22 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. మరోవైపు ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







