డబల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూట్ మొదలు..
- May 04, 2024
హైదరాబాద్: పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మార్చ్ లో రిలీజవ్వల్సిన ఈ సినిమా షూటింగ్ అవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఒక కొత్త గెటప్ లో కనపడటంతో బాగా వైరల్ అయింది ఆ క్యారెక్టర్.
పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో ఇంకా ప్రకటించకపోవడం విశేషం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన ఈ సినిమా తాజాగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టిందని సమాచారం.
ముంబై లో కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించింది. షూటింగ్ సెట్ లో పూరి జగన్నాధ్, ఛార్మి, పలువురు మూవీ యూనిట్ పూజలు చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన షెడ్యూల్ గణేశుడి ఆశీర్వాదంతో మొదలయింది అని తెలిపింది. ఈ షెడ్యూల్ లో భారీగా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం రామ్, పూరి జగన్నాధ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే 15 రామ్ పోతినేని పుట్టిన రోజున డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ వస్తుందని సమాచారం.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









