విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE

- May 06, 2024 , by Maagulf
విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE

యూఏఈ: CBSE బోర్డు పరీక్షలకు హాజరైన యూఏఈలోని విద్యార్థులు, ఇప్పుడు ఆన్‌లైన్‌లో వారి ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చు. వారికి కేటాయించిన మార్కులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవలే అభ్యర్థులు ఆన్సర్ షీట్లలో వారికి ఇచ్చిన మార్కులను తనిఖీ చేయడానికి లింక్‌ను పంపుతామని ప్రకటించింది. నిర్దిష్ట రుసుము చెల్లించడం ద్వారా విద్యార్థులను ఈ సేవను పొందవచ్చు.  బోర్డు ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది.  కాగా, ఆదివారం నాడు సిబిఎస్‌ఇ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాల విడుదల తేదీని ప్రకటించింది. మే 20 తర్వాత X మరియు XII తరగతులకు సంబంధించిన CBSE బోర్డు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com