యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- May 06, 2024
యూఏఈ: భారత్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాబోయే రోజుల్లో యూఏఈలో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో వస్తువుల కొరతను తగ్గించవచ్చని రిటైలర్లు ఆశిస్తున్నారు. గత ఏడాది భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత స్థానిక హైపర్మార్కెట్లలో ఉల్లి కిలోకు 6 దిర్హామ్లకు పైగా పలికింది. కొన్ని చోట్ల ధరలు కిలోకు Dh9 వరకు పెరిగాయి. నిషేధం కంటే ముందు ఉల్లిపాయ సాధారణంగా కిలోకు 3-4 దిర్హామ్లకు విక్రయించారు. కొన్ని హైపర్మార్కెట్లు మరియు ప్రధాన సూపర్మార్కెట్లు వారాంతపు ప్రమోషన్ల సమయంలో కిలో ధరను Dh2 వరకు తగ్గించాయి. నిషేధాన్ని తొలగించడం వల్ల మార్కెట్లో భారతీయ ఉల్లిపాయల కొరత తీరుతుందని ఆదిల్ గ్రూప్ ఆఫ్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







