యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- May 06, 2024
యూఏఈ: భారత్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాబోయే రోజుల్లో యూఏఈలో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశం తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో వస్తువుల కొరతను తగ్గించవచ్చని రిటైలర్లు ఆశిస్తున్నారు. గత ఏడాది భారతదేశం ఎగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత స్థానిక హైపర్మార్కెట్లలో ఉల్లి కిలోకు 6 దిర్హామ్లకు పైగా పలికింది. కొన్ని చోట్ల ధరలు కిలోకు Dh9 వరకు పెరిగాయి. నిషేధం కంటే ముందు ఉల్లిపాయ సాధారణంగా కిలోకు 3-4 దిర్హామ్లకు విక్రయించారు. కొన్ని హైపర్మార్కెట్లు మరియు ప్రధాన సూపర్మార్కెట్లు వారాంతపు ప్రమోషన్ల సమయంలో కిలో ధరను Dh2 వరకు తగ్గించాయి. నిషేధాన్ని తొలగించడం వల్ల మార్కెట్లో భారతీయ ఉల్లిపాయల కొరత తీరుతుందని ఆదిల్ గ్రూప్ ఆఫ్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









