రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- May 07, 2024
రియాద్: యూరోపియన్ యూనియన్ (EU) మరియు సౌదీ అరేబియా మధ్య వాణిజ్య సహకారం పెంపొందించడంలో భాగంగా మే 8న గల్ఫ్ ప్రాంతంలో మొదటి యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవం రియాద్ లో ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అధికారిక వెబ్సైట్ దీనిని చారిత్రకమైనదిగా తెలిపింది. ఈ ఈవెంట్ ఆర్థిక సంబంధాలను పెంపొందించడంలో కీలకమైనదిగా పేర్కొంది. సౌదీ అరేబియాలోని యూరోపియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ECCKSA) GCC దేశాలలో ఈయూ మద్దతుతో యూరోపియన్ వ్యాపారం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది యూరోపియన్ మరియు సౌదీ సంస్థలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది. గత అక్టోబర్లో సౌదీ-యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో జరిగిన ఒప్పందాలను అనుసరించి ఛాంబర్ ను ఏర్పాటు చేసారు. సౌదీ అరేబియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య వృద్ధి 2022 నాటికి సుమారు $80 బిలియన్లకు చేరిందని సౌదీ పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ వెల్లడించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో సుమారు 1,300 యూరోపియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. యూరోపియన్ యూనియన్ - సౌదీ అరేబియా మధ్య మొత్తం వాణిజ్యం 2022లో 75 బిలియన్ యూరోలకు చేరుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 2021లో 55 బిలియన్ యూరోలకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









