యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- May 07, 2024
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. యూఏఈ, జోర్డాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్, జోర్డాన్ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ డాక్టర్ ఐమాన్ అల్ సఫాది, రిపబ్లిక్ ఆఫ్ టర్కీయే విదేశీ వ్యవహారాలు మంత్రి HE హకన్ ఫిదాన్ లతో కీలక విషయాలను చర్చించారు. ఖతార్ తో సంబంధాలు, గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలు, తక్షణ మరియు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి చర్చించారు. ఖైదీలు, స్ట్రిప్లోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని నిలకడగా అందజేయడంపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఉద్దేశించిన అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతివ్వడానికి ఖతార్ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







