యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- May 07, 2024
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. యూఏఈ, జోర్డాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్, జోర్డాన్ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ డాక్టర్ ఐమాన్ అల్ సఫాది, రిపబ్లిక్ ఆఫ్ టర్కీయే విదేశీ వ్యవహారాలు మంత్రి HE హకన్ ఫిదాన్ లతో కీలక విషయాలను చర్చించారు. ఖతార్ తో సంబంధాలు, గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలు, తక్షణ మరియు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి చర్చించారు. ఖైదీలు, స్ట్రిప్లోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని నిలకడగా అందజేయడంపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఉద్దేశించిన అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతివ్వడానికి ఖతార్ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







