యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- May 07, 2024దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. యూఏఈ, జోర్డాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్, జోర్డాన్ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ డాక్టర్ ఐమాన్ అల్ సఫాది, రిపబ్లిక్ ఆఫ్ టర్కీయే విదేశీ వ్యవహారాలు మంత్రి HE హకన్ ఫిదాన్ లతో కీలక విషయాలను చర్చించారు. ఖతార్ తో సంబంధాలు, గాజా స్ట్రిప్ మరియు ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తాజా పరిణామాలు, తక్షణ మరియు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి చర్చించారు. ఖైదీలు, స్ట్రిప్లోని అన్ని ప్రాంతాలకు మానవతా సహాయాన్ని నిలకడగా అందజేయడంపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో భద్రత, స్థిరత్వాన్ని సాధించేందుకు ఉద్దేశించిన అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతివ్వడానికి ఖతార్ ముందుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..