సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
మనామా: సొంత సోదరుడిని కత్తితో చంపినందుకు దోషిగా తేలిన బహ్రెయిన్ యువకుడికి 15 సంవత్సరాల జైలు శిక్షను కాసేషన్ కోర్టు సమర్థించింది. గతంలో దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అనంతరం అతని శిక్షను హైకోర్టులో 15 సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు కాసేషన్ కోర్టు తగ్గిన తీర్పును ధృవీకరించింది. మొదట్లో, నిందితుడు హత్య ఆరోపణలను తిరస్కరించాడు. కానీ మాదకద్రవ్యాల వినియోగం మరియు హత్య ఆయుధాన్ని స్వాధీనం గుర్తించడంతో నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన రోజు తాను మద్యం సేవించానని, అది తన చర్యలపై ప్రభావం చూపి ఉండవచ్చని తెలిపాడు. తీవ్ర వాగ్వివాదం సందర్భంగా తన సోదరుడిని కత్తితో పొడిచి చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తదుపరి విచారణలో, ఆర్థిక వివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితుడు వివరించాడు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







