సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
మనామా: సొంత సోదరుడిని కత్తితో చంపినందుకు దోషిగా తేలిన బహ్రెయిన్ యువకుడికి 15 సంవత్సరాల జైలు శిక్షను కాసేషన్ కోర్టు సమర్థించింది. గతంలో దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అనంతరం అతని శిక్షను హైకోర్టులో 15 సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు కాసేషన్ కోర్టు తగ్గిన తీర్పును ధృవీకరించింది. మొదట్లో, నిందితుడు హత్య ఆరోపణలను తిరస్కరించాడు. కానీ మాదకద్రవ్యాల వినియోగం మరియు హత్య ఆయుధాన్ని స్వాధీనం గుర్తించడంతో నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన రోజు తాను మద్యం సేవించానని, అది తన చర్యలపై ప్రభావం చూపి ఉండవచ్చని తెలిపాడు. తీవ్ర వాగ్వివాదం సందర్భంగా తన సోదరుడిని కత్తితో పొడిచి చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తదుపరి విచారణలో, ఆర్థిక వివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితుడు వివరించాడు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







