సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- May 08, 2024
మనామా: సొంత సోదరుడిని కత్తితో చంపినందుకు దోషిగా తేలిన బహ్రెయిన్ యువకుడికి 15 సంవత్సరాల జైలు శిక్షను కాసేషన్ కోర్టు సమర్థించింది. గతంలో దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అనంతరం అతని శిక్షను హైకోర్టులో 15 సంవత్సరాలకు తగ్గించారు. ఇప్పుడు కాసేషన్ కోర్టు తగ్గిన తీర్పును ధృవీకరించింది. మొదట్లో, నిందితుడు హత్య ఆరోపణలను తిరస్కరించాడు. కానీ మాదకద్రవ్యాల వినియోగం మరియు హత్య ఆయుధాన్ని స్వాధీనం గుర్తించడంతో నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన రోజు తాను మద్యం సేవించానని, అది తన చర్యలపై ప్రభావం చూపి ఉండవచ్చని తెలిపాడు. తీవ్ర వాగ్వివాదం సందర్భంగా తన సోదరుడిని కత్తితో పొడిచి చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తదుపరి విచారణలో, ఆర్థిక వివాదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితుడు వివరించాడు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









