కశ్మీర్లో 'శ్రీరస్తు శుభమస్తు' షూటింగ్
- June 08, 2016
అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ చిత్రం చివరి షూటింగ్ షెడ్యూల్ కోసం కశ్మీర్ వెళ్తున్నట్లు హీరో అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 'శ్రీరస్తు శుభమస్తు చివరి షెడ్యూల్ కోసం రేపు కశ్మీర్ వెళ్తున్నాం, ఇంత వరకూ ఉత్తర భారతదేశంలోని దిల్లీ, చండీఘర్ తప్ప మరే ప్రదేశాన్ని చూడలేదు. ఎగ్జైటింగ్గా ఉంది అని ట్వీట్ చేశారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రకాశ్రాజ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుమలత, రవి ప్రకాశ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







