ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- May 10, 2024
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాగా, శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
సొంత ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పల్లె బాట పడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్ లో ఉండే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఓటేసేందుకు ఎలక్షన్ జర్నీకి సిద్ధం అయ్యారు. మే 13న పోలింగ్ ఉండగా.. 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం (10వ తేదీ) నుంచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలివెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో పండుగల సీజన్ లాగే ప్రయాణికుల కోసం స్పెషల్ సర్వీసులు సిద్ధం చేసింది ఆర్టీసీ. అలాగే, దక్షిణ మధ్య రైల్వే కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గతంతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, జిల్లాలో ఉండే వారు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే అవకాశం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా పండుగల సీజన్ లో నడిపే సర్వీసుల మాదిరిగా ఎలక్షన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు, బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







