‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు

- May 10, 2024 , by Maagulf
‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు

అమరావతి: జగన్ కోసం సిద్దంఏడు రోజుల్లోనే,79 లక్షల మంది సామాన్యులు వైఎస్సార్‌సీపీస్టార్ క్యాంపెయినర్లుగా సీఎం జగన్ కి మద్దతు తెలిపారు. వీరంతా కేవలం జగన్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు, నవరత్నాలు ప్లస్ మానిఫెస్టోలోని హామీలను ప్రతి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, అంతే కాకుండా జగన్ విశ్వసనీయత కలిగిన నాయకుడని చాటి చెబుతున్నారు . అన్నిటికంటే పెద్ద మొత్తంలో మహిళలే స్టార్ క్యాంపెయినర్లుగా పాల్గొంటున్నారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కాకినాడలో, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో అత్యధికంగా స్టార్ క్యాంపెయినర్లు తమ విశ్వాసాన్ని జగన్ కోసం తెలుపుతూ జగన్ కోసం సిద్ధం ప్రచారంలో ముందు నిలిచారు. ఇందులో ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల నుండి విశేష స్పందన లభించడం గమనార్హం.

ఈ స్టార్ క్యాంపెయినర్లు ఇంటింటికి తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలతో తమకు అందుతున్న ప్రయోజనాలు, సుపరిపాలన తెలుపుతూ, 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబుకు ఒకవైపు ఉంటె సీఎం జగన్ లాంటి నాయకుడి మరో వైపు ఉండి తమ సమస్యలను తీరుస్తున్నారని చెబుతున్నారు. ఈ రోజు కూడా, తమ 2024 మేనిఫెస్టోకి నమ్మకం కలిగించే ఒక్క ఆధారం కానీ దాని వెనకాల ఉన్న తర్కం పైన వారికీ అవగాహన లేదు. మేనిఫెస్టో వాగ్దానాలు, ముస్లిం రిజర్వేషన్లు, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో చిత్త శుద్ధి లేదని స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయటం మరో విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com