కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- May 14, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో ఆరు రోజులపాటు మే 20వ తేదీ వరకు కస్టడీని పొడగించిన కోర్టు.. తదుపరి విచారణ మే20కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా అధికారులు కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు. విచారణలో భాగంగా కవితకు 14రోజులపాటు జ్యూడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు ఈడీ తెలిపింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషిట్ దాఖలు చేశామని ఈడీ తెలుపగా.. మే20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జి షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇదిలాంటే గతంలో సీబీఐ కేసులో కవితకు మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. రెండు దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14రోజులకు ఒకసారి కవిత జ్యూడీషియల్ కస్టడీని రెండు సార్లు కోర్టు పొడిగించింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ కవితకు జ్యూడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు కోర్టు పొడిగించింది. ప్రస్తుతం ఈడీ కేసులోనూ మే 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు లో కవిత సవాల్ చేసింది. ఢిల్లీ హైకోర్టు లో కవిత బెయిల్ పిటిషన్ పై మే 24న విచారణ జరగనుంది.
మరోవైపు తిహార్ జైల్ లో వారానికి రెండు సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో ఐదు నిమిషాలు కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు. కవితకు ధైర్యం చెప్పడంతో పాటూ న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







