సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- May 19, 2024
రియాద్: శనివారం నుండి బుధవారం వరకు కింగ్డమ్లోని చాలా ప్రాంతాలను ప్రభావితం చేసే ఉరుములతో కూడిన తుఫానుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని పౌర రక్షణ శాఖ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరిక నోటీసును జారీ చేసింది. మక్కా ప్రాంతంలో ఆకస్మిక వరదలు, వడగళ్ళు, దుమ్ము మరియు ఇసుక తుఫానులకు అవకావం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తైఫ్, మేసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్-కమిల్ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పవిత్ర రాజధాని మరియు సమీప ప్రాంతాలైన జుముమ్, బహ్రా, రానియా, ఖుర్మా మరియు మోయాల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రియాద్ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం కురుస్తుందని, ఇది ఆకస్మిక వరదలు మరియు వడగళ్ళకు దారి తీయవచ్చని హెచ్చరించారు. అఫీఫ్, దవాద్మీ, ఖువీయా, మజ్మా, అల్-ఘాట్, షక్రా, అజ్ జుల్ఫీ, తాడిక్, మురాత్ మరియు వాడి అల్-దవాసిర్ లు ప్రభావితం అవుతాయన్నారు. వీటితోపాటు జజాన్, అసిర్ మరియు అల్ బహా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, జజాన్, మదీనా, హైల్ మరియు ఖాసిమ్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆకస్మిక వరదలు, నీటితో నిండిన ప్రదేశాలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









