సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- May 19, 2024
రియాద్: శనివారం నుండి బుధవారం వరకు కింగ్డమ్లోని చాలా ప్రాంతాలను ప్రభావితం చేసే ఉరుములతో కూడిన తుఫానుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని పౌర రక్షణ శాఖ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరిక నోటీసును జారీ చేసింది. మక్కా ప్రాంతంలో ఆకస్మిక వరదలు, వడగళ్ళు, దుమ్ము మరియు ఇసుక తుఫానులకు అవకావం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తైఫ్, మేసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్-కమిల్ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పవిత్ర రాజధాని మరియు సమీప ప్రాంతాలైన జుముమ్, బహ్రా, రానియా, ఖుర్మా మరియు మోయాల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రియాద్ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం కురుస్తుందని, ఇది ఆకస్మిక వరదలు మరియు వడగళ్ళకు దారి తీయవచ్చని హెచ్చరించారు. అఫీఫ్, దవాద్మీ, ఖువీయా, మజ్మా, అల్-ఘాట్, షక్రా, అజ్ జుల్ఫీ, తాడిక్, మురాత్ మరియు వాడి అల్-దవాసిర్ లు ప్రభావితం అవుతాయన్నారు. వీటితోపాటు జజాన్, అసిర్ మరియు అల్ బహా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, జజాన్, మదీనా, హైల్ మరియు ఖాసిమ్ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆకస్మిక వరదలు, నీటితో నిండిన ప్రదేశాలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







