సరికొత్త ఫీచర్ తేనున్న ఫేస్‌బుక్‌

- June 09, 2016 , by Maagulf
సరికొత్త ఫీచర్ తేనున్న ఫేస్‌బుక్‌

యూజర్ల సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌. తాజాగా.. యూజర్‌ పోస్టుల కోసం సరికొత్త ఫీచర్‌ను రూపొందిస్తోంది. ట్విట్టర్‌ తరహాలో న్యూస్‌ఫీడ్‌లో మాత్రమే పోస్టులు కన్పించేలా ఓ కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది.
సాధారణంగా యూజర్‌ చేసే పోస్టులు న్యూస్‌ఫీడ్‌తో పాటు.. వ్యక్తిగత టైమ్‌లైన్‌లోనూ కన్పిస్తాయి. ఒకవేళ టైమ్‌లైన్‌లో నుంచి తీసేయాలంటే ప్రత్యేకంగా దాన్ని హైడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త 'హైడ్‌ ఫ్రమ్‌ టైమ్‌లైన్‌' అనే ఫీచర్‌ ద్వారా షేర్‌ చేసిన పోస్టులు కేవలం న్యూస్‌ఫీడ్‌లో మాత్రమే కన్పిస్తాయట.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com