సరికొత్త ఫీచర్ తేనున్న ఫేస్బుక్
- June 09, 2016యూజర్ల సౌలభ్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్. తాజాగా.. యూజర్ పోస్టుల కోసం సరికొత్త ఫీచర్ను రూపొందిస్తోంది. ట్విట్టర్ తరహాలో న్యూస్ఫీడ్లో మాత్రమే పోస్టులు కన్పించేలా ఓ కొత్త ఆప్షన్ను తీసుకురానుంది.
సాధారణంగా యూజర్ చేసే పోస్టులు న్యూస్ఫీడ్తో పాటు.. వ్యక్తిగత టైమ్లైన్లోనూ కన్పిస్తాయి. ఒకవేళ టైమ్లైన్లో నుంచి తీసేయాలంటే ప్రత్యేకంగా దాన్ని హైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త 'హైడ్ ఫ్రమ్ టైమ్లైన్' అనే ఫీచర్ ద్వారా షేర్ చేసిన పోస్టులు కేవలం న్యూస్ఫీడ్లో మాత్రమే కన్పిస్తాయట.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







