జిలీబ్లో మద్యం తయారీ యూనిట్ను సీజ్
- May 26, 2024
కువైట్: భద్రతా అధికారులు జిలీబ్ ప్రాంతంలో స్థానిక మద్యం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. వాటిని నడిపే నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 70 బ్యారెళ్ల మద్యం, 500 స్థానిక మద్యం బాటిళ్లను కూడా బృందం స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టు ప్రకారం, సెక్యూరిటీ పెట్రోలింగ్కు ఒక వ్యక్తి బ్యాగ్ని తీసుకెళ్లడంపై అనుమానం వచ్చింది. అతడిని విచారించిన తర్వాత అతని బ్యాగులో స్థానికంగా తయారు చేసిన మద్యం ఉన్నట్లు గస్తీ బృందం గుర్తించింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయి మద్యం తయారీ యూనిట్ను గుర్తించి, నిందితులందరినీ అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







