ఒమన్ సముద్రంలో రెండు భూకంపాలు
- May 29, 2024
యూఏఈః నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం.. బుధవారం ఒమన్ సముద్రంలో స్వల్ప భూకంపాలు సంభవించాయి. యూఏఈ నివాసితులు 'స్వల్ప' ప్రకంపనలు అనుభవించినట్టు తెలుస్తోంది. రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో అర్ధరాత్రి 12.12 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం, 1.53 గంటలకు 2.8 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. అయితే, యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని నిపుణులు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో మే 17న యూఏఈలో 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు, ఏప్రిల్లో ఖోర్ ఫక్కన్లో నివాసితులు ప్రకంపనలు అనుభవించారు. జనవరిలో ఫుజైరా మరియు రస్ అల్ ఖైమా సరిహద్దులోని మసాఫీలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









