మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు
- June 10, 2016
సౌదీ అరేబియా, 95000 పైగా మసీదుల వద్ద సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు పలు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనికి సంబంధించి త్వరలో పూర్తి స్పష్టత రానుందని ఇస్లామిక్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ తౌఫీక్ అల్ సుదైరి వివరించారు. ప్రముఖమైన మసీదుల నుంచి మొదలు పెట్టి, ఈ ప్రాజెక్ట్ని విజయవంతం చేస్తామని, సెక్యూరిటీ ఏజెన్సీస్కీ తమకూ మధ్య పూర్తిస్థాయి సంయమనం ఉందని ఆయన వెల్లడించారు. గత ఏడాది సూసైడ్ బాంబర్స్, మసీదులపై దాడికి దిగి పలువుర్ని హతమార్చారు. పలువురు ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మసీదుల వద్ద పూర్తిస్థాయి భద్రత కోసం సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు చేయాలని భావించామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









