67 మిలియన్ దిర్హామ్ల ఆసుపత్రి బిల్లుల చెల్లింపు
- June 10, 2016
1,640 మంది పేద రోగుల కోసం గత ఏడాది 67 మిలియన్ దిర్హామ్ల మొత్తాన్ని ఆసుపత్రులకు చెల్లించినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారి చెప్పారు. ఆసుపత్రి బిల్లుల్ని చెల్లించలేక, ఖరీదైన వైద్యంతో ఆర్థికంగా చితికిపోయేవారికి ఇది ఎంతో ఊరట కల్గిస్తుందని వారు వివరించారు. దుబాయ్ హెల్త్ అథారిటీకి చెందిన ముసాదా కమిటీ చేపట్టిన ఫండ్ రైజింగ్తో ఈ మొత్తం సొమ్మును సేకరించగలిగామని కమిటీ హెడ్ సలీమ్ మొహమ్మద్ బిన్ లహెజ్ చెప్పారు. సర్జరీలు, డయాలసిస్, కిమోథెరపీ వంటి వాటి కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వ్తుందని, ఇది రోగులకు ఆర్థిక భారం అవుతుంది గనుక డిహెచ్ఎ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోని రోగులకోసం ఈ ఛారిటీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అరబిక్లో ముసాదా అంటే సహాయం. ఓ రేడియో ప్రోగ్రామ్ ద్వారా సంపాదించిన 4 మిలియన్ దిర్హామ్లతో 85 మంది రోగులకు సహాయం అందించగలిగారు. మరో రెండు కార్యక్రమాల్ని ముసాదా కమిటీ నిర్వహించబోతోందని, 30,000 భోజనాల్ని ఇఫ్తార్ కానుకగా డిహెచ్ఎ ఆసుపత్రుల్లో అందింంచనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









