67 మిలియన్ దిర్హామ్ల ఆసుపత్రి బిల్లుల చెల్లింపు
- June 10, 2016
1,640 మంది పేద రోగుల కోసం గత ఏడాది 67 మిలియన్ దిర్హామ్ల మొత్తాన్ని ఆసుపత్రులకు చెల్లించినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ అధికారి చెప్పారు. ఆసుపత్రి బిల్లుల్ని చెల్లించలేక, ఖరీదైన వైద్యంతో ఆర్థికంగా చితికిపోయేవారికి ఇది ఎంతో ఊరట కల్గిస్తుందని వారు వివరించారు. దుబాయ్ హెల్త్ అథారిటీకి చెందిన ముసాదా కమిటీ చేపట్టిన ఫండ్ రైజింగ్తో ఈ మొత్తం సొమ్మును సేకరించగలిగామని కమిటీ హెడ్ సలీమ్ మొహమ్మద్ బిన్ లహెజ్ చెప్పారు. సర్జరీలు, డయాలసిస్, కిమోథెరపీ వంటి వాటి కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వ్తుందని, ఇది రోగులకు ఆర్థిక భారం అవుతుంది గనుక డిహెచ్ఎ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోని రోగులకోసం ఈ ఛారిటీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అరబిక్లో ముసాదా అంటే సహాయం. ఓ రేడియో ప్రోగ్రామ్ ద్వారా సంపాదించిన 4 మిలియన్ దిర్హామ్లతో 85 మంది రోగులకు సహాయం అందించగలిగారు. మరో రెండు కార్యక్రమాల్ని ముసాదా కమిటీ నిర్వహించబోతోందని, 30,000 భోజనాల్ని ఇఫ్తార్ కానుకగా డిహెచ్ఎ ఆసుపత్రుల్లో అందింంచనున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







