67 మిలియన్‌ దిర్హామ్‌ల ఆసుపత్రి బిల్లుల చెల్లింపు

- June 10, 2016 , by Maagulf
67 మిలియన్‌ దిర్హామ్‌ల ఆసుపత్రి బిల్లుల చెల్లింపు

1,640 మంది పేద రోగుల కోసం గత ఏడాది 67 మిలియన్‌ దిర్హామ్‌ల మొత్తాన్ని ఆసుపత్రులకు చెల్లించినట్లు దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ అధికారి చెప్పారు. ఆసుపత్రి బిల్లుల్ని చెల్లించలేక, ఖరీదైన వైద్యంతో ఆర్థికంగా చితికిపోయేవారికి ఇది ఎంతో ఊరట కల్గిస్తుందని వారు వివరించారు. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీకి చెందిన ముసాదా కమిటీ చేపట్టిన ఫండ్‌ రైజింగ్‌తో ఈ మొత్తం సొమ్మును సేకరించగలిగామని కమిటీ హెడ్‌ సలీమ్‌ మొహమ్మద్‌ బిన్‌ లహెజ్‌ చెప్పారు. సర్జరీలు, డయాలసిస్‌, కిమోథెరపీ వంటి వాటి కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వ్తుందని, ఇది రోగులకు ఆర్థిక భారం అవుతుంది గనుక డిహెచ్‌ఎ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లోని రోగులకోసం ఈ ఛారిటీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అరబిక్‌లో ముసాదా అంటే సహాయం. ఓ రేడియో ప్రోగ్రామ్‌ ద్వారా సంపాదించిన 4 మిలియన్‌ దిర్హామ్‌లతో 85 మంది రోగులకు సహాయం అందించగలిగారు. మరో రెండు కార్యక్రమాల్ని ముసాదా కమిటీ నిర్వహించబోతోందని, 30,000 భోజనాల్ని ఇఫ్తార్‌ కానుకగా డిహెచ్‌ఎ ఆసుపత్రుల్లో అందింంచనున్నామని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com