డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే.!
- June 01, 2024
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయ్. పెరిగిన ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు శరీరం సహకరించడం లేదు. దాంతో డీ హైడ్రేషన్లు.. గట్రా చాలా ఇబ్బంది పెడుతున్నాయ్.
అందుకే డీ హైడ్రేషన్ కాకుండా బయటి వేడిని తట్టుకుని శరీరం కూల్ అవ్వడానికి కొన్ని రకాలా ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయ్. వాటిలో పుదీనాది మొదటి స్థానం.
ఈ హాట్ సమ్మర్లో డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే పుదీనాని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఉదయాన్నే పుదీనా జ్యూస్ తాగితే రోజంతా డీ హైడ్రేషన్ కాకుండా వుంటుంది.
అలాగే, పుదీనాని వంటల్లో కూడా విరివిగా వాడుకోవాలి. పలచని మజ్జిగ, రాగి జావ.. ఇలా జ్యూస్ ఏదైనా సరే, అందులో రెండు పుదీనా ఆకుల్ని వేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్లో వుంటాయ్.
పుదీనాలోని మింట్ సహజ సిద్ధమైన కూలెంట్గా పని చేస్తుంది. పుదీనాలోని మెంథాల్ అనే రసాయనం తొందరగా అలసటను దూరం చేస్తుంది. పుదీనాని జీలకర్ర, కాస్త నిమ్మరసంతో కలిపి జ్యూస్లా తీసుకుంటే, డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







