డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే.!
- June 01, 2024
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయ్. పెరిగిన ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు శరీరం సహకరించడం లేదు. దాంతో డీ హైడ్రేషన్లు.. గట్రా చాలా ఇబ్బంది పెడుతున్నాయ్.
అందుకే డీ హైడ్రేషన్ కాకుండా బయటి వేడిని తట్టుకుని శరీరం కూల్ అవ్వడానికి కొన్ని రకాలా ఆకు కూరలు బాగా ఉపయోగపడతాయ్. వాటిలో పుదీనాది మొదటి స్థానం.
ఈ హాట్ సమ్మర్లో డీ హైడ్రేషన్ బారిన పడకుండా వుండాలంటే పుదీనాని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఉదయాన్నే పుదీనా జ్యూస్ తాగితే రోజంతా డీ హైడ్రేషన్ కాకుండా వుంటుంది.
అలాగే, పుదీనాని వంటల్లో కూడా విరివిగా వాడుకోవాలి. పలచని మజ్జిగ, రాగి జావ.. ఇలా జ్యూస్ ఏదైనా సరే, అందులో రెండు పుదీనా ఆకుల్ని వేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్లో వుంటాయ్.
పుదీనాలోని మింట్ సహజ సిద్ధమైన కూలెంట్గా పని చేస్తుంది. పుదీనాలోని మెంథాల్ అనే రసాయనం తొందరగా అలసటను దూరం చేస్తుంది. పుదీనాని జీలకర్ర, కాస్త నిమ్మరసంతో కలిపి జ్యూస్లా తీసుకుంటే, డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!