ఇజ్రాయెల్ పౌరుల పై మాల్దీవులు నిషేధం!
- June 03, 2024
మాలే: ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. గాజాపై దాడులపై నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించాలన్న స్థానికుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్లాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇసుహాన్ మీడియాకు తెలిపారు. నిషేధం విధింపు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాల్దీవులను ఏటా 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా వారిలో 15 వేల మంది ఇజ్రాయెలీ పౌరులు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







