దుబాయ్ లో ఘనంగా కమల నాథుల సంబరాలు

- June 05, 2024 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా కమల నాథుల సంబరాలు

దుబాయ్: దుబాయ్ లో భారత పార్లిమెంట్ ఎలక్షన్ లో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల అందరూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా ఈ విజయోత్సవానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికీ  అభినందనలు తెలియజేయడం జరిగింది. మరియు రాబోయే ఐదు సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుంబల మహేందర్ రెడ్డి, బీజేపీ ఎన్ఆర్ఐ సీనియర్ నాయకులు/నిజామాబాద్ జిల్లా బిజెవైఎం ఉపాధ్యక్షులు వంశి గౌడ్, ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ గౌడ్, జనరల్ సెక్రటరీ దీపిక మరియు నాయకులు నవనీత్,పెనుకుల అశోక్,దేశవేని అజయ్, పవన్ సాయి, కృష్ణ, కటుకం రవి,అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్,అరుణ్,రాజు,హరికృష్ణ, నితిన్,మహేష్ ముడ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com