మరో నలుగురు బందీలు మృతి : ఇజ్రాయిల్‌ వెల్లడి

- June 05, 2024 , by Maagulf
మరో నలుగురు బందీలు మృతి : ఇజ్రాయిల్‌ వెల్లడి

గాజా, జెరూసలేం: ఇజ్రాయిల్‌ నుంచి హమాస్‌ గతేడాది అక్టోబరు 7న అపహరించుకువెళ్లినవారిలో ఇప్పటికీ వారి బంధీలో ఉన్నవారిలో మరో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం మంగళవారం ప్రకటించింది.

నెలల కిందటే ఖాన్‌ యూనిస్‌ ఆపరేషన్‌ సమయంలో వీరు మరణించినట్లు తెలిసిందని ఇజ్రాయిల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారీ తెలిపారు. అయితే వారి మృత దేహాలు మాత్రం హమాస్‌ అదుపులోనే వున్నాయని తెలిపారు. గత 8 మాసాలుగా సాగుతున్న దాడుల్లో గాజాలో బందీలుగా వున్న వారిని సురక్షితంగా విడిపించాలంటే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించేలా ఈ వీడియోతో ఇజ్రాయిల్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గాజాలో 80 మంది బందీలు జీవించి వున్నారని, మరో 43 మంది అవశేషాలు వున్నాయని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com