మరో నలుగురు బందీలు మృతి : ఇజ్రాయిల్ వెల్లడి
- June 05, 2024
గాజా, జెరూసలేం: ఇజ్రాయిల్ నుంచి హమాస్ గతేడాది అక్టోబరు 7న అపహరించుకువెళ్లినవారిలో ఇప్పటికీ వారి బంధీలో ఉన్నవారిలో మరో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం ప్రకటించింది.
నెలల కిందటే ఖాన్ యూనిస్ ఆపరేషన్ సమయంలో వీరు మరణించినట్లు తెలిసిందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ తెలిపారు. అయితే వారి మృత దేహాలు మాత్రం హమాస్ అదుపులోనే వున్నాయని తెలిపారు. గత 8 మాసాలుగా సాగుతున్న దాడుల్లో గాజాలో బందీలుగా వున్న వారిని సురక్షితంగా విడిపించాలంటే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించేలా ఈ వీడియోతో ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గాజాలో 80 మంది బందీలు జీవించి వున్నారని, మరో 43 మంది అవశేషాలు వున్నాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







