కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్
- June 07, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయనను నియమానికి చంద్రబాబు మొగ్గుచూపారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. కొత్త చీఫ్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ తక్షణమే బాధ్యతలను స్వీకరించనున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన నియామకం వెంటనే జరిగింది. ఈ నెల 12వ తేదీన జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను కూడా ఆయన చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









