రష్యాలో వైద్య విద్యనభ్యసిస్తున్న నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి
- June 07, 2024
రష్యా: రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలోని నదిలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మునిగిపోయారు.రష్యాలోని భారత రాయబార కార్యాలయం మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. నలుగురు విద్యార్థులు - 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. వెలికి నొవ్గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. వోల్ఖోవ్ నదిలో మునిగిపోతున్న ఒక భారతీయ విద్యార్థిని రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నిస్తున్న క్రమంలో వారు కూడా మునిగి పోయారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.అయితే ఒక యువకుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. "మేము మృతదేహాలను వీలైనంత త్వరగా బంధువులకు పంపించడానికి కృషి చేస్తున్నాము. ప్రాణాలను రక్షించిన విద్యార్థికి కూడా సరైన చికిత్స అందించబడుతోంది" అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం X లో తెలిపింది. "ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అని X లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









